Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మల్లికార్జున ఖర్గే బుధవారం ఏఐసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి రోజే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు . ప్రస్తుతం కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలిగా ఉన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్థానంలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 (b) ప్రకారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్థానంలో తక్షణ నిర్ణయాల కోసం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీతో పాటు 47మంది ఈ స్టీరింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుబ్బరామిరెడ్డికి ఈ కమిటీలో చోటు దక్కింది. అలాగే జీ 23 వర్గంలో ఉన్న ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్కు సైతం ఈ కమిటీలో చోటు దక్కింది. అంతకుముందు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులంతా కొత్త కమిటీ ఏర్పాటుకు వీలుగా తమ పదవులకు రాజీనామా చేశారు.