Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్న నేత రాహుల్ గాంధీకి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల బుధవారం లేఖ రాశారు. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని, దీనికి వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తున్నానని లేఖలో షర్మిల పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున పాదయాత్ర చేస్తున్నారని.. కావున దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడాలని ఆమె రాహుల్ గాంధీని కోరారు. ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన ఆమె కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.