Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిడ్నీ : టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న భారత ఆటగాళ్లు ప్రాక్టీసు అనంతరం ఐసీసీ అందించిన ఆహారాన్ని తిరస్కరించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. చల్లారిన శాండ్విచ్ లను, పండ్లను, ఫలాఫెల్ ను తాము స్వీకరించబోమని భారత క్రికెటర్లు స్పష్టం చేశారు. అనంతరం హోటల్ లో తమకు నచ్చిన ఆహారాన్ని తెప్పించుకుని తిన్నారు. ఈ ఘటనపై ఐసీసీ స్పందించింది. ఈ సమస్య తమ దృష్టికి వచ్చిందని.. తాము.. ఈ సమస్యను పరిశీలిస్తున్నామని తెలిపింది. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది.
టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు వచ్చిన అన్ని జట్లకు ప్రాక్టీసు అనంతరం ఒకే తరహా ఆహారాన్ని అందిస్తున్నారు. అయితే తీవ్ర ప్రాక్టీస్ సెషన్ అనంతరం చల్లటి పథార్థాలను భారత ఆటగాళ్లు తిరస్కరించారు.