Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిడ్నీ: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై సంచలన విజయంతో ఫుల్ జోష్లో ఉన్న భారత్.. టీ20 వరల్డ్కప్ గ్రూప్-2లో తమ రెండో మ్యాచ్లో పసికూన నెదర్లాండ్స్తో గురువారం తలపడనుంది. పొట్టి ఫార్మాట్లో ఇరు జట్లూ ఆడడం ఇదే తొలిసారి. టీమిండియా ఈ మ్యాచ్లో ఫేవరెట్గా కనిపిస్తున్నా.. డచ్ టీమ్ను తేలిగ్గా తీసుకొనే అవకాశం లేదు. పాక్తో మ్యాచ్లో భారత టాపార్డర్ విఫలం కాగా.. కోహ్లీ పోరాటంతో ఉత్కంఠ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తర్వాతి పోరులో పటిష్టమైన దక్షిణాఫ్రికాతో తలపడాల్సిన నేపథ్యంలో కెప్టెన్ రోహిత్, రాహుల్, సూర్యకుమార్లు ఈ మ్యాచ్ను ప్రాక్టీస్గా ఉపయోగించుకొని సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. రాహుల్ తన టెక్నిక్ను మెరుగుపరచుకోవాల్సి ఉండగా.. సారథిగా రాణిస్తున్న రోహిత్ ఫామ్ను అందిపుచ్చుకోవాలి. వీరు చెలరేగితే డచ్ బౌలర్లకు ఇక చుక్కలే. అందుకే టాస్ గెలిస్తే రోహిత్ సేన బ్యాటింగ్ ఎంచుకొని భారీస్కోరు చేసే అవకాశం ఉంది. ఇక, విరాట్ నుంచి జట్టు మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. కాగా, హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినిస్తారని భావించినా.. విన్నింగ్ జట్టును మార్చే అవకాశం లేదని బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే స్పష్టం చేశాడు. దీంతో పాండ్యా, దినేష్ కార్తీక్ ఫినిషర్ పాత్రలను పోషించాల్సి ఉంటుంది. బౌలింగ్ పరంగా కొత్తబంతితో భువనేశ్వర్, అర్ష్దీప్ గత మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. షమీ లయను అందుకోవాల్సి ఉండగా.. డెత్ ఓవర్లలో పరుగులను కట్టడిపై దృష్టిసారించాలి. అక్షర్కు మరో చాన్సివ్వొచ్చు. అశ్విన్, చాహల్లో ఒకరిని ఆడించే అవకాశాలున్నాయి.