Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో 1,112 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే బుధవారం ఒక్కరోజే 1,892 మంది కరోనా నుంచి కోలుకోగా ఒకరు ఈ వైరస్ తో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 20,821 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,46,880కి చేరింది. అలాగే మరణాల సంఖ్య 5,28,987 కి చేరుకుంది. ఇక మొత్తం కేసుల్లో 0.05 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.77 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.58 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు పేర్కొంది.