Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వివాదాస్పద సినీ దర్శకుడు, నిర్మాత రాంగోపాల్ల్ వర్మ తన కొత్త సినిమా పేరును ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తాను అతి త్వరలో వ్యూహం అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను అని తెలిపారు అయితే ఇది బయోపిక్ కాదని.. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్ అని పేర్కొన్నారు.
బయోపిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయని చెప్పారు. అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన వ్యూహం కధ , రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందని తెలిపారు. రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే వ్యూహం చిత్రం అన్నారు.
ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది .. మొదటి పార్ట్ వ్యూహం కాగా.. రెండో పార్ట్ శపథం అని అన్నారు. రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా ఉంటాయని చెప్పారు. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం వ్యూహం షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ పార్ట్ 2 శపథంతో తగులుతుందన్నారు. వ్యూహం చిత్ర నిర్మాత తనతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్ అని పేర్కొన్నారు. ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక ,ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు అని ట్వీట్ చేశారు.
ఆర్జీవీ బుధవారం ఏపీ సీఎం జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే ఆయన కొత్త చిత్రాన్ని ప్రకటించారు.