Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏపీ సీఎం జగన్ కాన్వాయ్ని అడ్డుకునేందుకు ఓ కుటుంబసభ్యుల ప్రయత్నం చేసింది. గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఘటన చోటుచేసుకుంది. కేసరపల్లి ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గర పిఠాపురానికి చెందిన కుటుంబసభ్యులు సీఎం కాన్వాయ్కు జగన్ చిత్రపటం చూపించారు. కుటుంబసభ్యుల దగ్గర ఆగిన కాన్వాయ్లోని సీఎంఓ డీఎస్పీ వాహనం ఉంది. సీఎంను కలిసేందుకు ఇద్దరు చిన్నారులతో సత్యనారాయణ, సాయిలక్ష్మి అక్కడికి చేరుకున్నారు. రూ.4.80 లక్షలు అప్పు ఉండటంతో గోడు చెప్పుకునేందుకు వచ్చామని వారు వెల్లడించారు.