Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్రలో తెలంగాణలోని నారాయణపేటలో జరుగుతోంది.
ఈ సందర్భంగా ఆయన పలువురు రైతులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
భూ యజమానులకే భద్రత లేకపోతే ఇంకెవరికి భద్రత ఉంటుందని అన్నారు. తెలంగాణలో సాగు కలిసి రాక పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారిలో మెజారిటీ రైతులు కౌలు రైతులేనని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని కౌలు రైతులను ఆదుకుంటామని ఆయన అన్నారు.