Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికను పారదర్శకంగా నిర్వహించడం కోసం అన్ని పోలింగ్ బూత్లకు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని సీఈఓ వికాస్రాజ్ వెల్లడించారు. అన్ని పోలింగ్ బూత్లకు మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్ను కవర్ చేసే విధంగా సాధారణ పరిశీలకుడితో సంప్రదించి సీఏపీఎఫ్ను విస్తరించడం జరుగుతుందన్నారు. ఉప ఎన్నిక జరుగుతున్న మునుగోడు నియోజకవర్గం ఉన్న రెండు జిల్లాల్లో ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఎన్నిక పారదర్శకంగా నిర్వహించడానికి వీలుగా, ఈ పక్రియలో ప్రజలను భాగస్వాములను చేయడానికి ‘cvigil’ అప్లికేషన్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని, వచ్చిన ఫిర్యాదులను 100 నిమిషాల వ్యవధిలో పరిష్కరిస్తామని చెప్పారు. పోలింగ్ రోజున బూత్కు 100 మీటర్లలోపు అభ్యర్థుల తరపున ఎవ్వరూ కూడా ఓటు వేయాలని ప్రచారం చేయకూడదని ఆదేశించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బులు ఇచ్చినా, మద్యం పంచినా ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఈఓ పేర్కొన్నారు. కాగా మునుగోడు ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా పని చేసిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథ రావును కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిందని తెలిపారు.