Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ బలగాలు, కేంద్ర బలగాలు తనిఖీలు చేపడుతున్నాయి. తాజాగా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న మంత్రి గంగుల కమలాకర్ వాహనాన్ని చౌటుప్పల్ వద్ద, సంస్థాన్ నారాయణపురం వద్ద రెండు చోట్లా సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు, కేంద్ర బలగాలు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో పోలీసులకు మంత్రి గంగుల కమలాకర్ పూర్తిగా సహకరించారు. కారులోని అన్ని బ్యాగులను మంత్రి తన వ్యక్తిగత సిబ్బందితో తెరిపించి తనిఖీకి సహకరించారు. అనంతరం మంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలియజేశారు.