Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమల : తిరుమలలో నవంబర్ 1 నుంచి టైమ్స్లాట్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నట్టు
టీటీడీ చైర్మెన్ సుబ్బారెడ్డి తెలిపారు. తాజాగా వారు మాట్లాడుతూ.. తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు నవంబర్ 1 నుంచి టైమ్స్లాట్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నట్టు చెప్పారు. టోకెన్లు తిరుపతిలో అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే డిసెంబర్ 1 నుంచి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు చేస్తున్నామని.. ఉదయం 8.30 నుంచి బ్రేక్దర్శనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు తిరుమలలోని టీటీడీ ఉద్యోగులకు ఈ-బైక్లు అందజేస్తామని చెప్పారు.