Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఇండోనేషియాలోని బాలి వేదికగా నవంబర్లో జరగనున్న జీ-20 లీడర్షిప్ సమ్మిట్లో బ్రిటన్ నూతన కొత్త ప్రధాని రిషి సునాక్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. ఇరువురూ ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు అంగీకారం తెలిపారు. ఈ మేరకు బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. 'గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్.. ప్రపంచ ఆర్థిక శక్తులుగా వికసించేందుకు కలిసికట్టుగా పనిచేయడానికి అధినేతలు సమ్మతం తెలిపారు. ఇండోనేషియాలో జరిగే జీ20 సదస్సులో వీరివురూ పరస్పర చర్చలు జరుపుతారు` అని పేర్కొన్నారు.