Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాలో ఘోరం జరిగింది. జిల్లాలోని చాపాడు మండలం చియ్యపాడు గ్రామంలో పొలంలో పురుగుల మందు పిచికారి చేస్తుండగా ముగ్గురు రైతులు కరెంట్ షాక్తో మృతి చెందారు. ముందుగా ఒక రైతు పిచికారి చేస్తుండగా అతడికి కరెంట్ షాక్ తగిలింది. అతడిని కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరికి కూడా షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు మరణంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.