Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ముషీరాబాద్ సీఎస్ పరిధి బోలక్పూర్లో విషాద ఘటన చేటుచేసుకుంది. గుల్షన్నగర్లో ఓ ప్లాస్టిక్ గోదాం మిషన్లో ఇరుక్కుని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడు భోలక్ పూర్ సిద్దిక్నగర్కు చెందిన రహమత్ అలీగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.