Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలోని చండూరు మండలం బంగారిగడ్డలో టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో బహిరంగ సభ వేదిక వద్దకు సీఎం కేసీఆర్ కాసేపటి క్రితం చేరుకున్నారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన బంగారిగడ్డకు బయల్దేరారు. కేసీఆర్ వెంట పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు కూడా ఉన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రసంగం పై ఆసక్తి నెలకొంది.