Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మహారాష్ట్ర అమరావతిలో భవనం ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం ప్రభాత్ సినిమా ఏరియా ప్రాంతంలో చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న అనంతరం అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీసి, గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించార. భవనం కూలిన ఘటనపై సమగ్ర విచారణకు డివిజనల్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసినట్లు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్లు తెలిపారు.