Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీ20 ప్రపంచ కప్లో భాగంగా భారత్పై సౌతాఫ్రికా విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో సఫారీలు గెలుపొందారు. 134 పరుగుల లక్ష్యాన్ని సఫారీలు 19.4 ఓవర్లలో చేధించారు. సఫారీలో 19.4 ఓవర్లలో 137 పరుగులు చేశారు. ఎడెన్ మాక్రమ్ (52), మిల్లర్ (59) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్లలో తెంబా బవుమా(10), క్వింటన్ డికాక్ (01), స్టబ్స్(06), పార్నెల్(02 నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్షదీప్ రెండు వికెట్లు పడగొట్టగా మహ్మాద్ షమీ, హార్ధిక్ పాండ్యా, అశ్విన్ తలో ఒక వికెట్ తీశాడు.