Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కండ్లకోయ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మెదక్ జిల్లా గుమ్మడిదలకు చెందిన టాటా ఏస్ వాహనం లో వెళ్తున్న 13 మందిలో ముగ్గురు చనిపోయారు. కంటైనర్ లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 9 మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స కోసం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు.