Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రేక్ దర్శనాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు బ్రేక్ దర్శనాలు జరిగాయి. తొలి రోజు బ్రేక్ దర్శనంలో లక్ష్మీనరసింహస్వామి వారిని 117 మంది భక్తులు దర్శించుకున్నారు. ఉత్తర ద్వారంగుండా స్వామివారి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ, వీవీఐపీ భక్తులకు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తుల సిఫారసులపై వచ్చే భక్తులకు రూ.300 టికెట్పై బ్రేక్ దర్శనం కల్పించనున్నారు.