Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నల్లగొండ జిల్లా పరిధిలోని మునుగోడు మునుగోడు నియోజకవర్గం పరిధిలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. అందులో 50 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని చెప్పారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉప ఎన్నిక పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. 5,686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నప్పటికీ కేవలం 739 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారన్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు 298 ఉన్నాయన్నారు. అర్బన్లో 35, రూరల్లో 263 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. ఇక నియోజకవర్గ పరిధిలో ఓటరు స్లిప్పుల పంపిణీ ఇప్పటికే పూర్తయిందని తెలిపారు. ఆన్లైన్లో కూడా ఓటరు స్లిప్పులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు. తొలిసారి కొత్త నమూనా ఓటరు కార్డులను పంపిణీ చేశామని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుందని పేర్కొన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో మెడికల్ టీమ్స్ను అందుబాటులో ఉంచామన్నారు.
3,366 పోలీసు సిబ్బందితో పాటు 15 కంపెనీల కేంద్ర బలగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. నియోజకవర్గం పరిధిలో 100 చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలో రూ. 6.80 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని... 4500 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు. రేపు సాయంత్రం 6 గంటల తర్వాత నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు.