Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : ఏపీలోని గన్నవరం విమానాశ్రయంలో విజయవాడ నుంచి నేరుగా షార్జాకు వెళ్లేందుకు విమాన సర్వీసు సోమవారం ప్రారంభమైంది. వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి...టీడీపీ ఎంపీ కేశినేని నానితో కలిసి ఈ ఎయిరిండియా విమానాన్ని ప్రారంభించారు. అలాగే విమానం ఎక్కిన ప్రయాణికులకు ఇద్దరు ఎంపీలు బోర్డింగ్ పాసులు అందజేశారు.
వారంలో రెండు రోజుల(సోమవారం,శనివారం) పాటు నడవనున్న విజయవాడ -షార్జా విమానం... ముందుగా షార్జా నుంచి విజయవాడ చేరుకుని ఆ వెంటనే తిరిగి షార్జా బయలుదేరుతుంది. నేడు 55 మంది ప్రయాణికులతో షార్జా నుంచి గన్నవరం చేరిన ఎయిరిండియా విమానం... 125 మంది ప్రయాణికులతో తిరిగి షార్జాకు తిరుగు ప్రయాణమైంది.