Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది. రాష్ర్టంలో అట్టారో ఇండియా కంపెనీ రూ. 600 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రకటించేందుకు సంతోషిస్తున్నానని వారు తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ పెట్టుబడి ద్వారా 300 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభించనుందని తెలిపారు. అలాగే పరోక్షంగా చాలా మందికి కూడా ఉపాధి లభించనుందని మంత్రి పేర్కొన్నారు.