Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు లోపే నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 1,046 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,54,638కి చేరింది. ప్రస్తుతం దేశంలో 17,618 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా 53 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,29,077కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.