Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో శ్రీలంకకు 145 రన్స్ టార్గెట్ విసిరింది ఆఫ్ఘనిస్తాన్. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 144 రన్స్ చేసింది. ఆఫ్ఘన్ బ్యాటర్లలో గుర్బాజ్ 28, ఘనీ 27, ఇబ్రహీం 22, నజీబుల్లా 18 రన్స్ స్కోర్ చేశారు. లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో ఆఫ్ఘన్ బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డారు. లంక బౌలర్లలో హసరంగ మూడు, లహిరు రెండేసి వికెట్లు తీసుకున్నారు.