Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీయాక్ట్ పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్పై న్యాయవాది ఎల్ రవి చందర్ తన వాదనలు వినిపించారు. రాజాసింగ్పై నమోరైన పీడీ యాక్ట్ను వెంటనే ఎత్తివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు. ప్రజల చేత ఎన్నుకున్న నాయకుడు జైల్లో ఉంటే పాలన కుంటుపడుతుందని అన్నారు. ఈ కేసుకు సంబంధించి కౌంటర్పై ప్రభుత్వం రేపు వాదనలు వినిపించనుంది. ఈ మేరకు హైకోర్టు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.