Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలో మరోసారి జీఎస్టీ వసూళ్లు భారీగా జరిగాయి. అక్టోబర్ నెలకుగానూ రూ.1,51,718 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ.26,039 కోట్లు.. ఎస్జీఎస్టీ కింద రూ. 33,396 కోట్లు వసూలైనట్టు పేర్కొంది. ఇక ఐజీఎస్టీ కింద రూ.81,778 కోట్లు, రూ.10,505 కోట్లు సెస్సుల రూపంలో వసూలైనట్టు చెప్పింది. గతేడాదితో పోలిస్తే వసూళ్లు 16.6 శాతం మేర పెరిగాయని.. గతేడాది ఇదే సమయంలో రూ.1.30 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు జరిగాయని పేర్కొంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో.. తెలంగాణలో రూ.4,284 కోట్ల వసూళ్లు జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. రాష్ర్టంలో గతేడాది అక్టోబర్లో రూ.3,854 కోట్లు వసూలయ్యాయి. అంటే ఈ ఏడాది 11 శాతం అధికంగా జీఎస్టీ వసూళ్లు జరిగాయి. ఇక ఏపీలో గతేడాది ఇదే నెలలో రూ.2,879 కోట్లు వసూళ్లు జరగ్గా.. ఈ ఏడాది రూ.3,579 కోట్లు వసూలైనట్లు కేంద్రం తెలిపింది. గతేడాదితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో 24% వృద్ధి నమోదైంది.