Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : పడవ బోల్తా పడ్డ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన ఏపీలో ఏలూరు జిల్లాలో కలకుర్రు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కలకుర్రు వద్ద కొల్లేరు సరస్సులో ఏడుగురితో వెళ్తున్న నాటుపడవ మరో ప్రాంతానికి వెళ్తుండగా బోల్తా పడింది. ఏడుగురిలో లక్ష్మి, శారద అనే ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. మరో ఐదుగురు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. సమాచరం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.