Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోర్బీ: గుజరాత్ లోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనా స్థలాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో కలిసి పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఆస్పత్రిలో బాధితులను కూడా ప్రధాని పరామర్శించారు. అనంతరం మోర్బీ ఎస్పీ కార్యాలయంలో అధికారులతో ప్రధాని సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. మృతుల, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకుంటామని పేర్కొన్నారు.