Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బంజారాహిల్స్లోని డీఏవీ పబ్లిక్ పాఠశాలలో ఎల్కేజీ చదివే నాలుగేండ్ల బాలికపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపును తక్షణమే రద్దుచేయాలని ఇటీవల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ డీఈవోను ఆదేశించారు. అందులోని విద్యార్థులను వేరు పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని సూచించారు. అయితే దీనిపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వచ్చింది. దాదాపు 700 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపు ఈ విద్యాసంవత్సరం వరకు కొనసాగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం నుంచి డీఏవీ పాఠశాల తెరుచుకోనుంది.