Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హైదరాబాద్లో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధలోని మాదాపూర్ ట్రాఫిక్ డివిజన్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఉదయం అంబేద్కర్ వై జంక్షన్, ఐడీఎల్ జంక్షన్, జేఎన్టీయూ, నిజాంపేట్, అల్విన్ ఎక్స్రోడ్, చందానగర్ మీదుగా యాత్ర కొనసాగుతుందని తెలిపారు. యాత్ర జరిగే సమయాలలో ఆయా జంక్షన్ల వైపు సాధారణ ట్రాఫిక్ను అనుమతించకుండా, ఇతర మార్గాలలో మళ్లిస్తున్నట్టు డీసీపీ తెలిపారు.