Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరుగుతున్న భారత్ జోడో యాత్ర హైదరాబాద్ మహానగరంలో రెండో రోజు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ కూడా నగరంలో సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. నేడు మాదాపూర్ డివిజన్లో జోడో యాత్ర కొనసాగనుంది. గత రెండు రోజుల కిందట షాద్నగర్ వద్ద జోడో యాత్రలో చోటుచేసుకున్న ఘటనతో పోలీసులు రాహుల్ గాంధీకి మరింత భద్రత పెంచారు. మరోవైపు యాత్ర కొనసాగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
కూకట్పల్లి మీదగా బాలనగర్ వైపు వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. వై జంక్షన్ను మూసివేసి యాత్ర ఐడీఎల్ చెరువు దాటిన తర్వాత వై-జంక్షన్ మీదగా రాకపోకలు పునరుద్దరించనున్నారు. బాలానగర్, ఎర్రగడ్డ మీదగా వచ్చే వాహనాలను మూసాపేట్ చౌరస్తా మీదుగా మూసాపేట్ జీహెచ్ఎంసీ కార్యాలయం, ఆంజనేయనగర్, రైన్బో విస్టా, కైత్లాపూర్ కూడలి, కెపీహెచ్బీ 4వ ఫేజ్, పైప్లైన్ రోడ్డు మీదగా మళ్లించనున్నారు.
జోడో యాత్ర జేఎన్టీయూ కూడలి దాటిన తర్వాత బాలానగర్, కూకట్పల్లి మీదగా వచ్చే వాహనాలకు ఐడీఎల్ కూడలి మీదగా అనుమతించనున్నారు. ఆయా వాహనాలను జేఎన్టీయూ కూడలి మీదగా ఫోరం మాల్ పై వంతెన నుంచి హిందు ప్రాజెక్టు పైప్ లైన్ రోడ్డు మీదుగా బీహెచ్ఇఎల్కు డైవర్ట్ చేయనున్నారు.