Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర భాగ్యనగరంలో కొనసాగుతోంది. బుధవారం ఉదయం కూకట్ పల్లి, జెఎన్టీయూ మీదుగా రాహుల్ పాదయాత్ర సాగుతోంది. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డు పక్కన టీ తాగారు. ఉదయం 10 గంటలకు హోటల్ కినేరా గ్రాండ్ వద్ద మార్నింగ్ బ్రేక్ ఇవ్వనున్నారు. సాయంత్రం 4 గంటలకు బీహెచ్ఈఎల్ బస్ స్టాండ్ నుంచి తిరిగి యాత్ర ప్రారంభంకానుంది. మియాపూర్, రామచంద్రపురం, పఠాన్చెరు వరకు పాదయాత్ర సాగనుంది. సాయంత్రం 7 గంటలకు హరిదోశ ముత్తంగి వద్ద కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు. రుద్రారమ్ గణేష్ మందిర్లో రాహుల్ గాంధీ నైట్ హాల్ట్ చేయనున్నారు.