Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూ ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉందన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు లోపే నమోదవుతూ మరణాల సంఖ్య పెరుగుతుండటం కలవర పరుస్తుంది. తాజాగా దేశంలో 1,190 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,55,828కి చేరుకోగా... గత 24 గంటల్లో కరోనా కారణంగా 1,375 మంది మృతి చెందారు. దీంతో రికవరీ రేటు 98.78 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని మొత్తం మరణాల సంఖ్య 5,30,452కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది.