Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబ్నగర్: బాలానగర్ కస్తూరిబా పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి అలేఖ్య అనుమనాస్పద స్థితిలో చనిపోయింది. తల్లిదండ్రులు బాలికను మంగళవారం బలవంతంగా స్కూళ్లో వదిలి వెళ్లారు. అలేఖ్య(13) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. మంగళవారం సాయంత్రం ఔషధాలన్ని కలిపి ఒకేసారి బాలిక తీసుకుంది. ఔషదాలు వికటించి బాలిక మృతి చెందిందని ఉపాధ్యాయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.