Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన వరల్డ్ కప్ కీలక మ్యాచ్లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ టీమిండియా విజయం సాధించింది. వర్షం కారణంగా సెకండ్ ఇన్నింగ్స్కు అంతరాయం కలగడంతో మ్యాచ్ను 16 ఓవర్లకు, టార్గెట్ను 150 పరుగులకు కుదించారు. బంగ్లాదేశ్ జట్టు 16 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. చివరి దాకా నువ్వానేనా అనేంత ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో 5 పరుగుల తేడాతో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్కు ఓపెనర్లు లిట్టన్ దాస్, షంటో శుభారంభం ఇచ్చారు. లిట్టన్ దాస్ 27 బంతుల్లో 3 సిక్సులు, 7 ఫోర్లు కొట్టి 60 పరుగులతో టీమిండియా బౌలర్లను బెంబేలెత్తించాడు. బంగ్లాదేశ్ ఏడు ఓవర్ల వద్ద బ్యాటింగ్ ఆడుతుండగా వర్షం ఆటంకం కలిగించింది. దీంతో.. డక్వర్త్ లూయిస్ విధానంలో ఓవర్లను, టార్గెట్ను కుదించారు. డక్వర్త్ లూయిస్ విధానంలో టీమిండియాకు ఈ విజయం దక్కింది. బంగ్లాదేశ్ జట్టు చివరి బంతి వరకూ పోరాడిన తీరు అభినందనీయమని చెప్పక తప్పదు. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ 64 పరుగులతో నాటౌట్గా నిలిచి అదరగొట్టగా, టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుస వైఫల్యాల తర్వాత ఫామ్లోకొచ్చి హాఫ్ సెంచరీతో రాణించాడు. సూర్యకుమార్ యాదవ్ 30 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీకి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది.