Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నవంబర్ 7వ తారీఖున జరగనున్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామ్కి టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ పోస్ట్ల కోసం 16,381 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, 9,559 మంది అభ్యర్థులు మాత్రమే ఈరోజు వరకు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో, 56 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. పేపర్-1, పేపర్-2 ఉంటాయి. రెండు విడతలుగా ఈ ఎగ్జామ్ జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి, మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుంది.