Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఎన్నో ఆశలతో సాగు చేసిన వరి, మిర్చి, పత్తి పంటలు నష్టాలను మిగల్చడంతో అప్పులు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్పట్నం శివారు జేత్యాతండాలో జరిగింది. జేత్యాతండాకు చెందిన లకావత్ శ్రీను(40) ఎకరం భూమిలో వరి, మిర్చి, పత్తి సాగు చేసి రెండుసార్లు నష్టపోయాడు. ఈ క్రమంలో పంటల పెట్టుబడుల కోసం రూ.4.5 లక్షల వరకు అప్పులు చేశాడు. వీటిని ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్థాపానికి గురై గత నెల 31న పురుగు మందు తాగాడు. అదేరోజు కుటుంబ సభ్యులు ఆయనను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు.