Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ లక్ష్యంగా కాల్పులు జరిగాయి. ఇమ్రాన్ ఖాన్ కుడి కాలుకు బుల్లెట్ గాయాలయ్యాయని సమాచారం. ఘటనలో మొత్తం ఐదుగురు గాయపడ్డారు. వజీరాబాద్లో ఇమ్రాన్ తన పార్టీ పీటీఐ తరపున ర్యాలీ నిర్వహిస్తుండగా కాల్పుల ఘటన జరిగింది. ఇమ్రాన్ ఖాన్ కంటైనర్కు అతి సమీపం నుంచి కాల్పులు జరిగాయి. ఇమ్రాన్ ఖాన్ను ఆస్పత్రికి తరలిస్తున్నారని పాకిస్థాన్ మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది. ఇమ్రాన్ను ఒక కంటెైనర్ నుంచి మరో కంటైనర్కు తరలిస్తున్న దృశ్యాలను పాక్ మీడియా ప్రసారం చేస్తోంది. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పీటీఐ కార్యకర్తలు పట్టుకున్నట్లు సమాచారం.