Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రజాస్వామ్య హత్య దేశ పునాదులకే ప్రమాదని సీఎం కేసీఆర్ అన్నారు . బీజేపీ దేశాన్ని అన్ని రంగాల్లో సర్వ నాశనం చేసిందన్నారు. నెల రోజులు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచి ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఓటర్లకు డబ్బు పంచడానికి టార్గెట్ పెట్టారని చెప్పారు. భవిష్యత్ లో తమకు ఎమ్మెల్యే టికెట్లు వస్తాయో రావో అనే భయంతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సొంతంగా రూ.1000 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్, పోలీస్ వాహనాల్లోనే టీఆర్ఎస్ నేతలు డబ్బు పంపిణీ చేశారని, వారికి పోలీసులు సహకరించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు డబ్బు పంచుతున్నారని కంప్లైంట్ ఇస్తే ఎన్నికల సంఘం పట్టించుకోలేదని విమర్శించారు. డబ్బు పంచిన వారిలో మొత్తం 42 మందే దొరికారని ఎన్నికల అధికారులు చెబుతున్నారని అన్నారు.