Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భోపాల్: మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఝల్లార్ వద్ద బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో 11 మంది దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ సిమలా ప్రసాద్ తెలిపారు.