Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హైదరాబాద్లోని అడిక్మెట్లో రోడ్డుప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం అడికెట్మెట్ ఫ్లైఓవర్పై ఓ బైకు అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతులను కామారెడ్డికి చెందిన భవన్ (20), నిర్మల్కు చెందిన రోషన్ (20)గా గుర్తించారు. మృతదేహాలను గాంధీ దవాఖానకు తరలించారు. మృతులిద్దరు ఓ డిగ్రీ కాలేజీలో బీబీఏ చదువుతున్నారని, కళాశాలకు వెళ్తుంగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.