Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కామారెడ్డి: మాతృవియోగంతో బాధపడుతున్న ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న గంప గోవర్ధన్ మాతృమూర్తి రాజమ్మ గురువారం కన్నుమూశారు. ఈనేపథ్యంలో భిక్కనూర్ మండలం బస్వాపూర్లోని ఆయన స్వగ్రామానికి చేరుకున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. రాజమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. గోవర్ధన్ను ఓదర్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూమితి తెలిపారు.