Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 114 పాయింట్లు లాభపడి 60,950కి చేరుకుంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 18,117 వద్ద స్థిరపడింది. మెటల్ సూచీ 3 శాతం వరకు లాభపడింది.