Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో రైతు పొలంలో కొండ చిలువ ప్రత్యక్షమైంది. కొండ చిలువ కనపడటంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం చాకచక్యంగా వ్యవహరించి కొండ చిలువను పట్టుకుని బస్తాలో వేసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రైతులు, స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.