Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో లిటరరీ ఫెస్ట్-2022 జరగనుంది. కాగా ఈ ఫెస్ట్ కు సంబంధించిన బ్రోచర్ నేడు ఆవిష్కరించారు. నల్లగొండలోని స్థానిక నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నెల 20, 21, 22 తేదీలలో హైదరాబాద్ లోని పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో లిటరరీ ఫెస్ట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ వాగ్గేయకారులతో పాటు నవ యువ రచయితలు గాయకులు పాల్గొననున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాటకు పట్టం కడుతూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రముఖుల సందేశాలు, సినీ గీతాల సాహిత్య విశ్లేషణ, వ్యాస సంకలనం, విడుదల పరిశోధక పత్రాల సమర్పణ, సినీ వాగ్గేయకారుల పరిచయం, సన్మానాలు ఉంటాయి. చివరి రోజున కవి సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అత్యధికంగా కళాకారులు పాల్గొనవలసిందిగా కోరారు. ఈ బ్రోచర్ ను డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్. శ్రీమతి గంజి భాగ్యలక్ష్మీ మేడం విడుదల చేయగా ఈ కార్యక్రమం లో అధ్యాపకులు శ్రీనాథ్ పటేల్, సరిత,తెలంగాణ సాహితి నాయకులు రచయిత బూర్గు గోపికృష్ణ, ఖమ్మం పాటి శంకర్ ,ఆకారపు నరేష్, తదితరులు పాల్గొన్నారు.