Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఈ నెల 12న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు రానున్నారు. రామగుండంలో పర్యటించనున్న మోడీ.. ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని పర్యటన దృష్ట్యా సీఎస్ సోమేశ్ కుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖలు, పోలీసు అధికారులతో సమావేశమైన సీఎస్.. ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరవుతారా..? లేదా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో పలుసార్లు తెలంగాణకు మోడీ వచ్చినప్పుడు.. సీఎం స్థాయిలో కేసీఆర్ హాజరు కాలేదు. అందుకు కారణాలు కూడా కేసీఆర్ వివరించారు. తాజాగా జాతీయ పార్టీ ప్రకటించిన కేసీఆర్.. ఈ నేపథ్యంలో మోడీని కలుస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.