Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాష్ట్రంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీదర్ నగరంలో వేగంగా వస్తున్న ఓ ట్రక్కు ఆటోను ఢీకొట్టిన దుర్ఘటనలో ఏడుగురు మహిళలు మరణించగా, మరో 11 మంది గాయపడ్డారు. మరణించిన మహిళలంతా కార్మికులని, వారు పనిప్రదేశం నుంచి ఇంటికి ఆటోలో తిరిగి వస్తుండగా వేగంగా వచ్చిన ట్రక్కు బేమలఖేడ ప్రభుత్వ పాఠశాల వద్ద ఢీకొట్టింది. మరణించిన వారిలో పార్వతి(40), ప్రభావతి (36), గుండమ్మ(60), యాదమ్మ (40), జగ్గమ్మ(34),ఈశ్వరమ్మ(55), రుక్మిణీబాయి(60)లుగా గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.