Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నడుస్తూ కూల్చివేసిన ప్రతీ ఇంటిని పరిశీలించారు. ఆపై బాధిత గ్రామాస్తులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ ముందు బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. పవన్ పర్యటనతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా... అంతకు ముందు ఇప్పటం గ్రామానికి బయలు దేరిని పవన్ పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ వాహనాలను నిలిపివేశారు. దీంతో పవన్ దాదాపు మూడు కిలో మీటర్ల మేరక నడుచుకుంటూ ముందుకు సాగారు. అనంతరం కారు పైకి ఎక్కి ఇప్పటం వైపు పయనమయ్యారు.