Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: జింబాబ్వేతో వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరు నమోదు చేసింది. మిడిలార్డర్ లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ కేవలం 25 బంతుల్లోనే 61 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సూర్య స్కోరులో 6 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. ఈ ముంబయి వాలా జింబాబ్వే బౌలింగ్ లో మైదానంలో తన ట్రేడ్ మార్కు చూపించాడు. మ్యాచ్ లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (51) అర్ధసెంచరీ సాధించగా, విరాట్ కోహ్లీ 26 పరుగులు చేశాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 18 పరుగులు చేసి ఎంగరవా బౌలింగ్ లో అవుటయ్యాడు. రోహిత్ శర్మ 15, పంత్ 3 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో షాన్ విలియమ్స్ 2, ఎంగరవా 1, ముజరబాని 1, సికిందర్ రజా 1 వికెట్ తీశారు.