Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు ఉత్కంటగా కొనసాగుతున్నాయి. మొదటి రౌండ్ నుంచి 11 రౌండ్ వరకు టీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా మునుగోడులో ఆధిక్యం కొనసాగిస్తోంది. తాజాగా 11 రౌండ్ లోను టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యం లోకి వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. 11 రౌండ్ వచ్చేసరికి టిఆర్ఎస్ పార్టీ 5800 ఓట్ల లీడింగ్ సంపాదించింది. బిజెపి పార్టీ రెండో స్థానంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 13000 ఓట్లను సాధించుకుంది. మొత్తం 15 రౌండ్లు ఉండగా 11 రౌండ్లు పూర్తయ్యాయి. టిఆర్ఎస్ గెలుపు లాంచనమేనని అనిపిస్తుంది.